జూలూరుపాడు, అక్టోబర్ 29, (మన్యం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్స్ డైలీ వేస్ వర్కర్స్ గిరిజన అసోసియేషన్ పిలుపు మేరకు జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ శనివారం పాఠశాల ఎదుట సమ్మెకు దిగారు. ఈ సమ్మెకు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మద్దతు తెలుపుతూ డైలీ వేజ్ వర్కర్స్ తోపాటు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్స్ మరియు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని అన్నారు. అర్హులు కానీ వారందరికి టైం స్కేల్ ఇవ్వాలని, 30% పిఆర్సి కలుపుతూ ప్రతి నెల 5వ తారీఖు లోపు జీతాలు చెల్లించాలని అన్నారు. డైలీ వేజ్ వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి వారికి న్యాయం చేయాలని కోరారు.
Navigation
Post A Comment: