మన్యం న్యూస్, గుండాల( అక్టోబర్ 22) :గుండాల మండలం లో ఘనంగా కొమరం భీమ్ జయంతిని శనివారం ఘనంగానిర్వహించారు. మండలం పరిధిలోని మర్కోడు ఆశ్రమ పాఠశాలలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొమరం భీమ్ జయంతి వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందని కొమరం భీం అడుగుజాడలలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సర్పంచ్ శంకర్ బాబు, యువజన విభాగం అధ్యక్షులు సతీష్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: