- మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
- అనారోగ్యంతో మృతి చెందిన జిమ్మిడి.సరిత దినకర్మలకు బియ్యం అందజేసిన సర్పంచ్,ఉపసర్పంచ్
మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని తాటిగూడెం గ్రామపంచాయతీలో గల గాంధీ నగర్ కాలనీకి చెందిన జిమ్మిడి సరిత ఇటివల కాలంలో అనారోగ్యంతో మరణించడం జరిగింది. తన దశదినకర్మలకు స్థానిక ఉపసర్పంచ్ జాడి నాగరాజు సర్పంచ్ కొమరం విశ్వనాథం చేతుల మీదుగా 50 కేజీల బియ్యం అందజేశారు.అనంతరం వారి దిన కర్మలకు హాజరై మృతురాలు జిమ్మిడి.సరిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం నింపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి బి(టి)ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ నాయకులు దుర్గం. ముసలయ్య జిమ్మిడి.కోటయ్య, జనగం.నర్సయ్య ,జిమ్మిడి. భుజంగరావు,ముసలమ్మ,గోగు. నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: