మన్యం న్యూస్, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 18 తేదీనుండి 20వ తేదీ వరకు ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ట్రైబల్ స్టేట్ మీట్ వాలీబాల్ క్రీడలలో చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక కవడం జరిగింది.ఎంపికైన విద్యార్థులు పడిగ.సాయికుమార్, కుర్సం.అరవింద్ కుమార్,వాడ.రాజేష్,వాడ. నందు లు ఎంపిక కావడం జరిగింది.ఎంపికైన విద్యార్థులు నవంబర్ నెలలో జరిగే ఇంటర్ సొసైటీ లీగ్ వాలీబాల్ క్రీడలలో పాల్గొంటారని హెచ్ఎం జగన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఈడి.బాల సుబ్రహ్మణ్యం,పీఈటి వట్టం.సంపత్ కుమార్ ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: