మన్యం న్యూస్, గుండాల, సెప్టెంబర్ (12) : ఆళ్లపల్లి మండలంలో ఉపాధి హామీ కూలీల కష్టాన్ని స్వాహా చేస్తున్న అధికారులను కఠినంగా శిక్షించాలని ఎంపీపీల జిల్లా ఫోరం అధ్యక్షురాలు మంజు భార్గవి డిమాండ్ చేశారు. మండలంలో ఉపాధి హామీ పని చేయని వారికి జాబ్ కార్డు తయారు చేసి వారి పేరు మీద పనిచేసినట్టు సృష్టించి వారి డబ్బులను దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్న అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ అవినీతి బాగోతాన్ని డిఆర్డిఓ పిడి దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. జిల్లా ఉన్నత అధికారులు స్పందించి బాధ్యతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు
Navigation
Post A Comment: