CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రూప్-1 అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి

Share it:


మన్యం న్యూస్, ములుగు : 

అక్టోబర్ 16న జరుగు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టిఎస్ పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు, అదనపు కలెక్టర్లు,చీఫ్ సూపర్డెంట్ లు, లైసన్, అసిస్టెంట్ లైజన్ అధికారులతో ఈ నెల 16న జరుగు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షను పగడ్బందీగా,సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.జిల్లాలో 1933 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని వీరి కోసం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.చీఫ్ సూపరిండెంట్లు,లైసన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ లు నియమించడం జరిగిందని,అన్ని చీఫ్ సూపరింటెండెంట్ రూమ్స్ లలో,స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రిన్సిపాల్,వైస్ ప్రిన్సిపాల్,తహసిల్దార్, నాయబ్ తహసిల్దార్,జిల్లా అధికారులను నియమించడం జరిగిందని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ  సంగ్రామ్ సింగ్ జి పాటిల్, జిల్లా అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్,ఏఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్,డిఆర్ఓ రమాదేవి,డిఈఓ జి.పాణిని,తహసిల్దార్ ఎం.సత్యనారాయణ స్వామి,లక్ష్మణ్,రాజ్ కుమార్,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: