సారపాక, అక్టోబర్ 23, మన్యం న్యూస్:
బంజారాహిల్స్ డిఏవి పాఠశాలలో చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని బూర్గంపాడు మండల ఐద్వా కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం సారపాక పట్టణం సుందరయ్య నగర్ కాలనీలో ఐద్వా కమిటి ఆధ్వర్యంలో నిందితుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం మండల కార్యదర్శి పాపినేని సరోజన మాట్లాడుతూ... ఈ దేశంలో మహిళలు అర్ధరాత్రి ఎటువంటి భయం లేకుండా బయటకు వెళ్లిన రోజే స్వాతంత్రం వచ్చినట్లు అని స్వాతంత్ర్య సమర యోధులు చెప్పిన మాటలు నేడు దేశంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. అర్థరాత్రి కాదు పట్టపగలు కూడా బయట తిరగలేని పరిస్థితి దేశంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మహిళలు, చిన్నారులు దారుణంగా హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై చిన్నారులపై హత్యలు, హత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకుని మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌవులూరి నాగమణి, సాదిక, మీనా, సరస్వతి, వహిద్, పుష్ప తదితర మహిళలు పాల్గొన్నారు.
Post A Comment: