CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట నుండి తిరుపతికి బస్సు సదుపాయం, ప్రజల వద్దకు ఆర్టీసీ -డీయం రాజ్యలక్ష్మి

Share it:

 


మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం రోజు ఆర్టీసీ డీఎం యు రాజ్యలక్ష్మి అధ్యక్షతన ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఈనెల 27వ తారీకు నుంచి తిరుపతికి  బస్సు సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. టైమింగ్స్ మధ్యాహ్నం ఒంటిగంట నలబై నిమిషాల కి అశ్వారావుపేట నుండి సత్తుపల్లి కి బయలుదేరుతుందని, సత్తుపల్లి నుంచి తిరుపతికి మూడు గంటల కు బయలుదేరుతుందని తెలిపారు. అలాగే తిరుపతి నుండి అశ్వారావుపేట కు సాయంత్రం మూడు గంటల కు బస్సు సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు  ఆమె తెలిపారు. అలాగే తిరుపతిలో దర్శన టికెట్లు కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే అందుబాటులో ఉంటాయని దీనిని ప్రజలందరూ భక్తులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. అలాగే ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ  సంస్థ అశ్వారావుపేట నుండి తిరుపతికి బస్సు సర్వీస్ చాలా అద్రుష్టం అని, ఈ యొక్క అవకాశాన్ని  ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఆయన ప్రజలను ప్రయాణికులను కోరారు అలాగే ఆర్టీసీ కి అందరూ కూడా ఆర్టీసీలో ప్రయాణించి ఆర్టీసీకి ఆదాయం సమకూరే విధంగా ప్రజలు సహకరించాలని ఆయన ప్రయాణికులను కోరారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ మేనేజర్ గడ్డం శ్రీనివాస్, సిబ్బంది ఎన్ సునీత, ఆనంద్, వర్కర్స్ ప్రేమ్, రాంబాబు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: