మన్యం న్యూస్, భద్రాచలం /దుమ్ముగూడెం ::
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో అక్టోబర్ 15 నుండి 31 వరకు నిర్వహించే క్లీన్ ఇండియా ప్రోగ్రాం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆధ్వర్యంలో భద్రాచలంలో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ను పోగు చేశారు దీనిలో భాగంగా గిరిజన డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆధ్వర్యంలో భద్రాచలంలోని జనసామర్థవంత ప్రాంతాలైన బస్టాండ్,యూ బి రోడ్డు, చర్చి రోడ్డు, దేవాలయం రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల్లోని ప్లాస్టిక్ ను సేకరించి గ్రామపంచాయతీ వారికి అందించారు. అలానే ఈ కార్యక్రమము నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ పి ఓ బి సుజాత ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడటం వలన కలిగే నష్టాలు గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ స్టాప్ పి ప్రవీణ్ కుమార్ బాలాజీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: