CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల అవగాహన పాల్గొన్న ఏడూళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్

Share it:


మన్యం న్యూస్,పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని సీతారామపురం పంచాయతీ సమీపంలోని ఉప్పాక బ్రిడ్జి వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్  నియమ నిబంధనలను గురించి సిఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక ఆటో డ్రైవర్ లైసెన్స్, ఆర్ సి కలిగి ఉండాలని, స్థానికులను చాలా జాగ్రత్తగా వారి గమ్య స్థానాలకు చేరవేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యపానం సేవించి వాహనం నడిపిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: