CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల అధ్యక్షుడు పదవి తీసే అర్హత కానీ ఇచ్చే అర్హత కానీ డిసిసి కి లేదు

Share it:


మన్యం న్యూస్,మణుగూరు(అక్టోబర్22):

 మణుగూరు మండలం లో గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గురజాల గోపి గారిని అధ్యక్ష పదవి నుండి తీసే అధికారం డిసిసి కి లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  పిసిసి కి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యే పోదెం వీరయ్య వ్యవహరిస్తున్నారు. డిసిసి అధ్యక్ష పదవి తొలగించేదాకా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం ముందస్తు సమాచారం ఇవ్వకుండా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మండల నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేయకుండా  సభ్యులకు తెలియకుండా మండల అధ్యక్ష పదవి నుండి పనిచేసే వారిని తొలగిస్తూ అడుగులకు మడుగులు వత్తుతూ, భజన చేసే వారిని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ వినాశనానికి పూనుకుంటున్న పోదేం వీరయ్యను డీసీసీ నుంచి తక్షణమే తొలగించాలని  డిమాండ్ చేస్తున్నాం.  మతిస్థిమితం లేని పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ నీ తొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకోమని  మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

నోట్:- డిసిసి పదవి నుండి పోదాం వీరయ్యను తొలగించకపోతే మణుగూరు మండలంలో 2000 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు అభిమానులు ముకుమ్మడి రాజీనామా చేయడానికి  సిద్ధంగా ఉన్నాం.మణుగూరు మండల సీనియర్ నాయకులు బూర్గుల నరసయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ జానాపాటి వేణు,ఉపాధ్యక్షుడు ఎండి. షకీల్, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎండి షరీఫ్ ఉపాధ్యక్షులు పులిపాటి పాపారావు, కోడెమ్ సాంబశివరావు మాజీ ఎంపిటిసి ముక్కెర లక్ష్మణ్,కొమరం.సైదులు, మడకం.శ్రీను, మాలోత్ కిషన్,దేవి, కొమరం కృష్ణవేణి, పాయం. రాజమ్మ అభిమానులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: