*జీవో నెంబర్ 24 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్స్ ఇవ్వాలి.
* ఆదివాసి హక్కులను కాలరాస్తే ఉద్యమిస్తాం..
*ఆదివాసి హక్కుల పోరాట సమితి డిమాండ్.
* మన్యం న్యూస్ అక్టోబర్ 29 వాజేడు.
మండలంలో ఎస్సై, కానిస్టేబుల్ కు అర్హత సాధించిన ఆదివాసి అభ్యర్థులు, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యములో ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్స్ కొరకు తహసిల్దార్ లక్ష్మణ్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి
పాయం, జానకి రమణ, డివిజన్ అధ్యక్షులు సిద్ధబోయిన సర్వేశ్వరరావు, మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం పూర్వం1917 అంతకు ముందు నుండి బ్రిటిష్ ప్రభుత్వం ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతంగా నిర్ణయించారు.ఈ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసిలకు పోలీస్ సంబంధిత శాఖ లో ఉద్యోగం సాధించాలంటే సరైన ఎత్తు, బరువు,లేకపోవడం ప్రధానమైన సమస్య, అయితే ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ అభ్యర్థులకు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ తో కూడిన సడలింపు తో అర్హులయ్యే అవకాశాన్ని కల్పించాలనీ, ఏజెన్సీ సర్టిఫికెట్ ద్వారా ఎంతో మంది ఆదివాసీ అభ్యర్థులు అర్హతతో పాటు ఉద్యోగం సాధించి ఆదివాసి అభ్యర్థుల సంకల్పాన్ని పెంపొందించాలని, ఆయన అన్నారు . తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎస్సై, కానిస్టేబుల్ కు అర్హత సాధించిన ఆదివాసి అభ్యర్థులకు జీవో నెంబర్ 24 ప్రకారం ఏజెన్సీ సర్టిఫికెట్స్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇవ్వని పక్షంలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల సహాయ కార్యదర్శి సంతోష్, బాలకృష్ణ, సాగర్, ఆదివాసి కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: