CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ జూనియర్ కలశాల లో గణితం లెక్చరర్ ని నియమించాలి

Share it:


  • ప్రభుత్వ జూనియర్ కలశాల లో గణితం లెక్చరర్ ని నియమించాలి 
  •  విద్యార్థి యువజన సంకల్పన సమితి మరియు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ కు వినతిపత్రం 

మన్యం న్యూస్,భద్రాచలం(అక్టోబర్26):

 భద్రాచలం పట్టణం ప్రభుత్వ జూనియర్ కలశాల లో గణితం లెక్చరర్ ని నియమించాలని కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి కి విద్యార్థి యువజన సంకల్పన సమితి మరియు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వటం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంకల్పన సమితి  మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు గుమ్మడి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కలశాలలో MPC గ్రూపు కి సంబంధించిన గణితం లెక్చరర్ లేక Mpc గ్రూపు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉన్న ఒక గణితం లెక్చరర్ ని వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసే సరికి ఆ గణితం లెక్చరర్ పోస్ట్ కాళీ గా ఉండడంతో విద్యార్థులకు ఆ గణితం సబ్జెక్టు చెప్పే వారు లేకపోయేసరికి విద్యార్థులు ఆ గణితం సబ్జెక్టు సిలబస్ పూర్తి చేయలేక సతమతమవుతున్నారని అన్నారు. ఉన్నతవిద్యాశాకాధికారులు స్పందించి తక్షణమే  గణితం లెక్చరర్ ని నియమించాలని వి వై ఎస్ ఎస్ గా డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్,మురళి కృష్ణ,శ్రీను,లక్ష్మణ్,రమ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: