CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి..

Share it:

 


  • ఫీజు రియంబర్స్ మెంట్,  స్కాలర్ షిప్ లు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి..
  • జీవో నెంబర్ 37ను ఉపసంహరించుకోవాలి..
  • ఏఐవైఎఫ్  ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి పత్రం..

జూలూరుపాడు, అక్టోబర్ 26, (మన్యం న్యూస్) :  రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 2,700 కోట్ల బోధన ఉపకార వేతన రుసుములను విడుదల చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం ఏఐవైఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో జూలూరుపాడు తహశీల్దార్ లూధర్ విల్సన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు పగడాల అఖిల్, షేక్ చాంద్ పాషా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇతర వృత్తి విద్య కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బోధన ఉపకార వేతనం రుసుమును అందించడంలో  విఫలం చెందారని, 2021_2022 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల బోధన ఉపకార వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఇంజనీరింగ్ ఫీజులను పెంచుతూ విడుదల చేసిన జీవో నెంబర్ 37 ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఎస్ కే సమీర్, కిలారి వినోద్, గంజి మధు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: