మన్యం న్యూస్ గుండాల/ఆళ్లపల్లి అక్టోబర్ (16) బిఆర్ఎస్ పార్టీలో వెల్లువల చేరికలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆళ్లపల్లి మండలం పరిధిలోని చంద్రపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు పార్టీలో చేరాయి వీరికి రేగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అందుచేత ఆయన సమక్షంలో పార్టీలో చేరినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వేమూరి రాంబాబు, యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , కీసరి నరేష్ , సమ్మయ్య, రాము, అశోక్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: