మన్యం న్యూస్,గూడూరు:
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ గంగారం గూడూర్ బయ్యారం యువతకు కబడ్డీ వాలీబాల్ క్రీడలను పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని ఏపూరు గ్రామపంచాయతీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రధానోత్సవానికి ఈ ముగింపు కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హాజరై మాట్లాడారు.క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సదయ్య, గూడూరు సిఐ యాసిన్, బయ్యారం సీఐ బాలాజీ, కొత్తగూడా ఎస్సై నగేష్, గంగారం ఎస్సై ఉపేందర్, బయ్యారం ఎస్సై రమాదేవి, గూడూరు ఎస్సై దిలీప్ కుమార్, ఏపూరి గ్రామపంచాయతీ సర్పంచ్ మౌనిక దిలీప్ లు పాల్గొన్నారు.
Post A Comment: