CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు సోపానాలు...కృత్యాధార బోధన తో ఆకట్టుకున్న త్రీ ఇంక్లైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17.. విద్యార్థుల భవిష్యత్తును ఖచ్చితమైన ప్రణాళికలతో తీర్చిదిద్దడమే కాకుండా వారికి నాణ్యమైన విద్యాబోధన  ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందని గౌతమ్ పూర్ స్కూల్ కాంప్లెక్స్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రవీందర్ అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తొలిమెట్టు కార్యక్రమంలో విద్యార్థులకు సులభతరమైన బోధన విధానాన్ని అలవరచుకునేందుకు తరగతి వారీగా పాఠ్యాంశాలు కనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించుకున్న కృత్యాధార వస్తువులతో అభ్యసన అభివృద్ధిని పెంపొందించినప్పుడే అనుకున్న ఫలితాలను  రాబట్టుకోవచ్చు అన్నారు. గతంలో పాఠశాలలో బట్టి పట్టే విధానానికి స్వస్తి పలికి తొలి మెట్టు లో పొందుపరిచిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని సరికొత్త పద్ధతులలో ప్రయోగాత్మకంగా బోధన విధానాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఆ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలు కే స్వరూప భవాని వ్యర్థం తో అర్థాన్నిచ్చే కృత్యాధార బోధనతో విద్యార్థులకు సరికొత్త పద్ధతిలో పాఠాలను బోధించడం ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు తబితరాణి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: