CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంఎల్ఎ మెచ్చా

Share it:


 మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమర వీరుల సంస్మరణ వార్షికోత్సవాల్లో బాగంగా శనివారం ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంఎల్ఎ మెచ్చా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రక్తం దానం చేసిన వారికి పండ్లు మరియు జూస్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో రక్త దానం చాలా గొప్పదని, రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. దండబత్తుల బజార్ లో అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అయ్యప్ప స్వాముల బిక్ష ను స్వయంగా వడ్డించారు. తెలంగాణ ఉద్యమ నాయకులు ముబారక్ బాబా మాతృ మూర్తిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, మోహన్ రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జుజ్జూరి వెంకన్న బాబు, టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంపూర్ణ, బిర్రం వెంకటేశ్వరరావు, యుఎస్ ప్రకాష్, సీతారామ స్వామి, రవి, కలపాల శ్రీను, ఆవుల చిన్ని, దిలీప్, తుంపాటి రమేష్, గంగాధర్, ఆనంద్, చిప్పనపల్లి శ్రీను, తగరం హరి, బాణాల నారాయణ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: