మన్యం న్యూస్ గుండాల అక్టోబర్ (15) ఆదివాసీల గుండె చప్పుడు కొమరం భీమ్ అని ఎంపీపీ మంజు భార్గవి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కొమరం భీమ్ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఎంపీపీ మంజు భార్గవి మాట్లాడుతూ. కొమరం భీమ్ ఆసియా సాధనలో గిరిజనులంతా ముందు నడవాలని వారు కోరారు. కొమరం భీమ్ గిరిజనుల కోసం ఎంతో కృషి చేశారని అలాంటి మహనీయుని వర్ధంతి సభలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సర్పంచులు శంకర్ బాబు, నరసింహారావు, వెంకట్ నారాయణ, టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు,యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , పార్టీ నాయకులు కిషోర్ బాబు, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: