మన్యం న్యూస్, అశ్వారావుపేట: కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని విష జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన తెలంగాణ సాంస్కృతిక సారథి టీం టీడర్ వెంకటే శ్వర్లు ఆధ్వర్యంలో శుక్రువారం కళాజాతా ద్వారా వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి శీలం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని అచ్యుతాపురం, మద్దికొండ గ్రామ పంచాయతీ కేంద్రాల్లో కళాజాతా నిర్వహించారు. దళిత బంధు, రైతుబంధు, కేసీఆర్ కిట్లు తదితర ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథ కాలపై పాటల ద్వారా అవగాహన కల్పించారు. కళాకారులు టీం లీడర్ నకిరికంటి వెంకటేశ్వర్లు మరియు కాల్వకట్ట జాన్, పరకాల అజయ్, బొమ్మెర ముత్యం, గంధం సత్య వాణి, షేక్ కౌసర్ భాను మొదలుకు కళాకారులు కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ నాగలక్ష్మి, గ్రామ పెద్దలు, మద్దికొండ గ్రామపంచాయతీ అంగన్వాడి టీచర్, ఆశా కార్యకర్తలు వార్డు మెంబర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: