CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాల మహానాడు ఆధ్వర్యంలో పాలాభిషేకం

Share it:

 


మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని  మాలమహానాడు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కి , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పాలాభిషేకం నిర్వహించారు. దేశంలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. ఇందుకుగాను సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అన్ని వర్గాల ప్రజలకు అందిస్తూ ఆదుకుంటున్నారని, నియోజకవర్గ వ్యాప్తంగా 1500ల మంది దళితుల కుటుంబాలకు దళిత బందు వర్తింపజేయడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుదిగొండ రామకృష్ణ, డివిజన్ అధ్యక్షులు దాసరి రవి, డివిజన్ ప్రధాన కార్యదర్శి నక్క ప్రశాంత్, మండల ఉపాధ్యక్షులు యాస ఇశ్రాయేలు, మండల ప్రధాన కార్యదర్శి చీకటి రఘు, డివిజన్ ఉపాధ్యక్షులు కోడిరెక్కల రమేష్, డివిజన్ కార్యవర్గ సభ్యులు నల్ల నరేష్, తోటమల్ల అనిల్, సల్ల మోహన్, తోకల నరేష్, తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: