ములకలపల్లి:(సెప్టెంబర్ 12), మన్యం మనుగడ ప్రతినిధి:మండల కేంద్రంలో మధ్యాహ్నం భోజనం వర్కర్ల యూనియన్ మండల కార్యదర్శి బుగ్గ వెంకట నరసమ్మ అధ్యక్షతన మధ్యాహ్న భోజన వర్కర్ల ధర్నా నిర్వహించి స్థానిక ఎంఈఓ కు మధ్యాహ్నం భోజనం వర్కర్ల సమస్యలపై వినతిపత్రం ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటి యు మండల కన్వీనర్ ముదిగొండ రాంబాబు పాల్గొని మాట్లాడుతూ గత తొమ్మిది నెలల నుంచి మధ్యాహ్నం భోజనం వర్కర్లకు వేతనాలు,కోడిగుడ్ల బిల్లులు జీతాలు పడలేదని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కనీస వేతనం 26,000 అమలు చేయాలని,కోడిగుడ్లు ప్రభుత్వం సరఫరా చేయాలని,వేతనం 2000 పెంచి పెండింగ్లో ఉంచారని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నిమ్మల మధు,ముదిగొండ అన్న సూర్య,సుజాత,పద్మ,అశ్విని, పుల్లమ్మ,పశువులమంగా,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: