మన్యం మనుగడ, కరకగూడెం: మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామంలో గల రైతు వేదికలో మహిళలకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేశారు అనంతరం 32 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను ఎంపీపీ రేగా కాళికా,తహశీల్దారు ఉషా శారద చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా ఆడపడుచులకు కులమతాలకు అతీతంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని అలాగే వితంతు, వికలాంగులకు,వృద్ధులకు ఆసరా పింఛన్లు అందిస్తుందని అన్నారు. అలాగే పేదంటే ఆడపిల్లల కోసం కళ్యాణ లక్ష్మి పథకం కింద ఒక లక్ష 116 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరక గూడా ఎంపీటీసీ ఎలిపెద్ది శైలజ వట్టంవారిగుంపు సర్పంచ్ అరెం.సాంబ,భూక్య, భగ్యలక్ష్మి కరకగూడెం ఉపసర్పంచ్ రావుల రవి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అధికారులు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు మహిళలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: