CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం..... : అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు...

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ : ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. తొలుత స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలు పాడి, ఆటలాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చీరలను  పెట్టి గౌరవించే ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ  సత్యనారాయణ, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఎంపీటీసీ  దారా బాబు, లంకా విజయలక్ష్మి , సర్పంచులు పూసం వెంకటేశ్వర్లు, బాబూరావు, టిఆర్ఎస్ మండల నాయకులు మేడ మోహన్ రావు, మాలోత్ బోజ్యా నాయక్, సారేపల్లి శేఖర్, భూపతి రమేష్, భూపతి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: