మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామపంచాయతీ లో రాజ్యసభ సభ్యులు ఎంపీ బండి పార్థసారధిరెడ్డి, ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వారి సహకారంతో గత కొన్ని రోజులు క్రితం గోదావరి వచ్చి వరద ముంపుకు గురైనా 200 కుటుంబాల బాధితులకు 10 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులు, పంపిణీ చేసిన అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్.ఈ సందర్భంగా కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన సుపరిపాలన తో ప్రజల గుండెల్లో బలమైన స్థానం దక్కించుకున్నారు అని అన్నారు.వరద ముంపు ప్రాంతం బాధితుల కు శాశ్వత పరిష్కారం కోసం 1000 కోట్ల రూపాయలతో ఎత్తైన ప్రదేశాలలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను చేపడుతుందన్నారు, భవిష్యత్తులో గోదావరి వరద ఉధృతికి గ్రామాలు మునగడం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.ఎత్తయిన కరకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం త్వరలోనే పనులు ప్రారంభిస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడి క్రిష్ణవేణి,ఉప సర్పంచ్ చావా వీరరాగావులు,రాగ సత్యం, కమాటం సురేష్,కవిశెట్టి మణికుమార్,రావుల రాఘవులు, చింతపట్ల రాంబాబు,ఆవుల సంతోష్,దావూరి వెంకన్న,నాగశ్రీను,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: