గుండాల/ఆళ్ళపల్లి సెప్టెంబర్ 15(మన్యం మనుగడ) : ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు బతుకమ్మ ఘాటును ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ మంజు భార్గవి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రములోని జీసీసీ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని బతుకమ్మ ఘాట్ కు ప్రభుత్వం కేటాయించింది. అందులో భాగంగా గురువారం స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, కోఆపరేటివ్ ఛైర్మన్ గొగ్గెల రామయ్య భూమి పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలకు ఆర్ల దగ్గర వాతావరణం లో మహిళలు వేడుకలు జరుపుకునేందుకు బతుకమ్మ ఘాట్ ఎంతో ఉపయోగపడుతుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాబా, మండల నాయకులు ఎండీ అతహార్, బుర్ర వెంకన్న, కిశోర్ బాబు, ఖయ్యుం, నరెడ్ల ప్రవీణ్ కుమార్, ఆరీఫ్, ఆదం, వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాస్, వజ్రేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: