మన్యం టీవీ చర్ల :
తెలంగాణ సాధన కోసం పదవులను సైతం వదులుకుని మలిదశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచిన రాజకీయ వేత్త, తన జీవితాంతం బడుగుబలహీన వర్గాల కోసం పాటుపడిన ప్రముఖ సామాజిక వేత్త శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్థంతి సందర్భంగా ఈరోజు చర్ల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సోయం రాజారావు గారి, ఆధ్వర్యంలో ఆ స్ఫూర్తి ప్రదాతకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, మండల యూత్ అధ్యక్షుడు కాకి అనిల్, లక్ష్మీ కాలనీ సర్పంచ్ కంతి బాలక్రిష్ణ, సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, ఉద్యమ నాయకుడు పటాన్ మహబూబ్,తడికల బుల్లేబ్బాయి,వలేపోగు గణేష్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: