మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం పంచాయతీలోని ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులను గురుపూజోత్సవ సందర్భంగా ఆ పంచాయతీ సర్పంచ్ ఈసం భవతి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని,ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ అంకిత భావంతో మా పంచాయతీలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు కావలసిన జ్ఞానాన్ని అందిస్తున్నారని, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. గురుపూజోత్సవం పురస్కరించుకొని ఈరోజు మా పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: