మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామం నుండి టాటా ఏసీ వాహనంలో సుమారు 20 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తుండగా ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి దాడి చేసి పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న తిప్పనపల్లి గ్రామానికి చెందిన తేజావత్ సూరిబాబు తో పాటు, వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆమె తెలిపారు. ఈ దాడిలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: