జూలూరుపాడు, సెప్టెంబర్ 25, (మన్యం మనుగడ ప్రతినిధి) : అలనాటి హీరో "రెబల్ స్టార్" కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి పాఠకులకు విధితమే, నేడు దశదిన కర్మలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామానికి చెందిన దామెర్ల పుల్లయ్య అనే "రెబల్ స్టార్" కృష్ణంరాజు వీరాభిమాని తన సొంత ఖర్చులతో గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా తన అభిమాన హీరో ప్లెక్సీలను ఏర్పాటు చేసి, కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాల లేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు లేళ్ళ గోపాలరెడ్డి, దామెర్ల అనుదీప్, తెల్లబోయిన నరసింహారావు, దారె బోయిన రవి, బహరాలి, షేక్ అబ్దుల్లా, దామెర్ల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: