CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్సీ ఎస్టీలకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలి : తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షుడు రాజమల్ల సుకుమార్

Share it:


మన్యం మనుగడ, మంగపేట:

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ పోటీ పరీక్షల్లో ఎస్సీ ఎస్టీ లకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని తెలంగాణ మాల మహానాడు ములుగుజిల్లా అధ్యక్షుడు రాజమల్ల సుకుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం మంగపేట మండల కేంద్రం లో  జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు రాజమల్ల సుకుమార్ మాట్లాడుతుతెలంగాణా ప్రభుత్వం రాజ్యాంగం ఉల్లాంఘనకు పాల్పడుతున్నారని, పోలీస్ పోటీ పరీక్షలు ఎస్సి, ఎస్టీ విద్యార్థుల ను అయోమయం లోకి  నెట్టివేస్తున్నారని,కట్ ఆఫ్ మార్కులను ఓసీలకు 80 మార్కుల నుండి నుండి 60 కు,బీసీ లకు 70 మార్కుల నుండి నుండి 60 మార్కులను తగ్గించారని పేర్కొన్నారు. కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం 60 మార్కులకే కట్ ఆఫ్ పెట్టడమేంటని ప్రశ్నించారు. రిజర్వేషన్లు అమలు  చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుందని . కచ్చితంగా రాజ్యాంగ హక్కుగా ఉన్నటువంటి రిజర్వేషన్లను ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల్లో  60 నుండి 40 కి కట్ ఆఫ్ మార్కులు ఎస్సీ ఎస్టీలకు తగ్గించాలని, బీసీలకు 60 నుండి 50 కి కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని రాజమల్ల సుకుమార్ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: