CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నియోజకవర్గ అభివృద్ధి రేగా తోనే సాధ్యం : మండల అధ్యక్షులు నరసింహారావు

Share it:


గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 15(మన్యం మనుగడ) : పినపాక నియోజకవర్గం రేగా కాంతారావు తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ రేగా కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఏజెన్సీ మండలమైన ఆళ్లపల్లికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోయే విధంగా కృషి చేస్తున్న రేగా కాంతారావుకు మండల ప్రజలు ఎప్పుడు బాసటగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజు భార్గవి, పార్టీ యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , ప్రచార కార్యదర్శి ఖయ్యూం, పార్టీ నాయకులు వెంకన్న, ప్రవీణ్ కుమార్, ఆదాం, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: