CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆశ్రమ పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి : పి డి ఎస్ యు డివిజన్ కార్యదర్శి నరేందర్

Share it:


గుండాల సెప్టెంబర్ 15(మన్యం మనుగడ) :  బూర్గంపాడు మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని పి డి ఎస్ యు డివిజన్ కొత్తగూడెం కార్యదర్శి నరేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుందన్నారు. పాప పాఠశాలలోని ఒక గదిలో నిద్రిస్తున్న సిబ్బంది వెతకకుండా తప్పిపోయిందని చెప్పడం ఎంతవరకు సమంజసంమన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు ఉండలేకపోతున్నామని పేర్కొనడం చూస్తుంటే వారికి ఎంత ఇబ్బంది తలెత్తుతుందో అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా పాఠశాల నిర్వహణను సమర్థవంతంగా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, రమేష్ , భాస్కర్, దినేష్ , మహేందర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: