మన్యం మనుగడ, అశ్వారావుపేట: హైదరాబాద్ లో శనివారం జరిగే జాతీయ సమైక్యత వేడుకలో భాగంగా ఆదివాసీ గిరిజన సమ్మేళనం సమావేశం, గిరిజన భవనం ప్రారంభం సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు, అశ్వారావుపేట నియోజక వర్గ ఎంఎల్ఏ మెచ్చా సూచిన మేరకు అశ్వారావుపేట నుండీ వెళ్ళే ఎస్టీ ప్రజా ప్రతినిధులు, ఎస్టీ ప్రభుత్వ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో వారిని ఎక్కించి వారికి టిఫిన్స్ మరియు వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ప్యాకెట్లు, ఇచ్చి ప్రతి బస్సుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ అలాగే పంచాయితీ కార్యదర్శుల ను ఏర్పాటు చేసిన బస్సులను శనివారం ఉదయం 4గంటలకు జెండా ఊపి ప్రారంభించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి మరియు ఎంఆర్ఓ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ విద్యాధరావు, మండల నాయకులు. ఈ కార్యక్రమానికి అశ్వరావుపేట నుండి ఐదు బస్సులు వెళ్లడం జరిగింది.
Navigation
Post A Comment: