మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలం సింగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని మద్దులగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజన బధిర (మూగ -మేజర్ ) యువతిపై, అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన సంచలనం కలిగిస్తుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్దకు యువతి వెళ్లగా, శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయం లో ఆమెను ద్విచక్ర వాహనంపై స్థానిక అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించగా అతనిని అదుపులోకి తీసుకొన్నట్లు యువతి సోదరుడు తెలిపారు. ఈరోజు బాధిత యువతి ఇంటికి పోలీసులు వెళ్లి, పూర్తి వివరాలు సేకరించినట్ల తెలియజేశారు.
Navigation
Post A Comment: