మన్యం మనుగడ, ఏటూరు నాగారం :
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల యందు ఆరు జోనల్ ను కలిపి జోనల్ స్థాయి క్రీడలను శుక్రవారం స్థానిక పివో అంకిత్ హాజరై క్రీడలను ప్రారంభించి అనంతరం అయినా మాట్లాడుతూ.క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలలో పాల్గొని మరింత ప్రతిభ కనబరిచి,త్వరలో జరగబోవు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం డిడి పోచం,వరంగల్ డి టి డి ఓ ప్రేమ కళ,ఏ టి డి ఓ దేశి రామ్,ఏటూరు నాగారం ఏసీఎంవో కోడి రవీందర్,
వరంగల్ ఏసీఎంవో రాములు,జి సి డి ఓ సుగుణ, ఎస్ఓ శ్యామలత,డిప్యూటీ డిఈఓ సారయ్య,పీడీలు వెంకన్న,సమ్మయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: