గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 23(మన్యం మనుగడ) : మండలంలోని ఆడపడుచులకు బతుకమ్మ కానుకను జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకను అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1000 బతుకమ్మ చీరలను అందించామన్నారు. నలుగురికి కల్యాణ లక్ష్మి చెక్కులను సైతం అందించినట్టు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సాదియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: