మన్యం మనుగడ ఏటూరునాగారం
అక్టోబర్ 5న జరిగే దసరా ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకుందామని స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని రావణాసురుడి వద స్థలాన్ని నాయకులు, గ్రామస్తులు కలిసి పరిశీలించారు.వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు,యువకులు ప్రజల సాయం తీసుకొని కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
దసరా ఉత్సవ కమిటీ ఎన్నిక
ఏటూరునాగారం గ్రామంలో జరిగే దసరా ఉత్సవాల సంద్భంగా కమిటీని ఎన్నుకున్నారు.స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక జరిగింది.గౌరవ సలహదారుడిగా కాకులమర్రి లక్ష్మణ్బాబు,ఉత్సవ కమిటీ కన్వీనర్ ఇర్సవడ్ల వెంకన్న,కో కన్వీనర్లు నూక ప్రభాకర్, తాడూరి రఘు,కమిటీ సభ్యులుగా గడదాసు సునీల్కుమార్,సప్పిడి రాంనర్సయ్య,తుమ్మ మల్లారెడ్డి,గండెపల్లి నర్సయ్య, చిటమట రఘు, రంజిత్, నూతి రమేష్,చంద్రబాబు,కర్ల అరుణ,అంతటి నాగరాజు, గండెపల్లి సత్యం,మెర్గు వెంకటేశ,చెన్న రాంబాబు, ప్రమోద్, చిప్ప నాగరాజు, వంగాల వీరన్న,గారె పోషాలు, గుడ్ల దేవేందర్ లను ఎన్నుకున్నారు.ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లను సమన్వయంతో ముందుకు వెళ్లాలని సర్పంచ్ కోరారు.
Post A Comment: