మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఐలాపురం గ్రామంలో మినీ గురుకులంలో జరుగుతున్న స్వచ్చ డ్రైవ్ కార్యక్రమాన్ని, పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ బుధవారం పరిశీలించారు. ఎంపిపి గుమ్మడి గాంధీ కి ప్రధానోపాధ్యాయురాలు హేమలత పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న, పనులను పరిశీలించారు. పాఠశాలలోని స్టోర్ రూం ను పరిశీలించి, వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని,మెను ప్రకారం భోజనాన్ని అందించాలని ,సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది పాయం సమ్మక్క, వరలక్ష్మి, సుభద్ర, స్వరూప రాణి, వార్డెన్ అరుణ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: