CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతారాంపురం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. ముగ్గురికి గాయాలు..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండలంలోని సీతారాంపురం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్ల మండలం కుదునూరు గ్రామానికి చెందిన ఎం.నరేష్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి భద్రాచలం వైపు నుండి వస్తున్న ఆటోను గంగోలు గుడి దగ్గర నుండి వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు కారుని ఓవర్టేక్ చేసి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నవారు కింద పడిపోయారు. ఆటోలో ఉన్న ముగ్గురికి ద్విచక్ర వాహన దాడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని 108 ద్వారా భద్రాచలం తరలించగా వీరిలో నరేష్ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఆటో డ్రైవర్ అజయ్, అనూష ద్విచక్ర వాహదారుడికి గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి ఎస్ఐ రవికుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..


Share it:

CINEMA

TELANGANA

Post A Comment: