మన్యం టివి , మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సిపిఎం పార్టీ నాయకులు తాటి ముసలయ్య ఆశయాలను సాధించాలని, సిపిఎం మండల కమిటీ పిలుపునిచ్చింది.బుధవారం మండలం లోని తిర్లాపురం గ్రామంలో తాటి ముసలయ్య 12వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరి. నాగేశ్వరరావు జెండా ను ఆవిష్కరించి,విప్లవ జోహార్లు తెలియజేశారు.అనంతరం సిపిఎం మండల కార్యదర్శి కోడిశాల రాములు,నెల్లూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికుల ఉద్యమాన్ని నిర్మించడంలో, మండలంలో పార్టీ ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రత్యేకంగా తిర్లాపురంలో పార్టీని నిర్మించడంలో తాటి ముసలయ్య ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి అన్నారు.ఐక్య ఉద్యమాల ద్వారా ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఈ సందర్బంగా వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీవీ ఎం.వి ప్రసాద్,నందం.ఈశ్వరరావు,వైనాల.నాగలక్ష్మి,మడి.నరసింహారావు,తాటి.నరసింహారావు,తాటి.ముత్యాలరావు,హేమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: