CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ప్రజాప్రతినిధులు : సరైన సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారు

Share it:

 


 గుండాల సెప్టెంబర్ 27(మన్యం మనుగడ) మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని ప్రజా ప్రతినిధులు బహిష్కరించారు. మండలంలోని పంచాయతీల సర్పంచులకు, ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడాన్ని నిరసిస్తూ బహిష్కరిస్తున్నట్లు గుండాల సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ సంధాని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కరించేందుకు నిర్వహించే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులకే సమాచారం ఇవ్వకపోతే ఎలా అన్నారు. ఎంపీపీ ముక్తి సత్యం సమావేశం కొనసాగించి అధికారులతో మండల సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు


Share it:

AP

TELANGANA

Post A Comment: