మన్యం మనుగడ,మంగపేట. :
మంగపేట మండలం రమణక్కపేట గ్రామం లో జరిగిన పత్రికా సమావేశం లో ఏడిఎస్ఎస్ మండల అధ్యక్షులు గాజా నరసింహారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ లో దళితులు బ్రిటిష్ రాక పూర్వం నుండి అంటే క్రీస్తు శకం 1600 కు పూర్వమే భారతదేశం లోని అడవుల్లో, కొండల్లో నివసించారని, వీరినిబ్రిటిష్ వారు 1835 లో కొండ దళితులు అని పూర్వం పిలిచే వారని అటువంటి ఏజెన్సీలో నివసిస్తు అప్పటి నుండి ఇప్పటి వరకు అడవులు తరిగి పోయి అడవుల మీద, వాటి ప్రతి ఫలాలు మీద ఆధారపడిన దళిత కుటుంబాలు రోజువారీ కూలీలు గా మారారని, రోజులు మారాయి కానీ దళితుల జీవితాలు మారలేదు,దళితుల కుటుంబాలు దయనీయమైన పేదరికంలో నివసిస్తున్నారని,ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కో యూనిట్ చొప్పున దళిత బంధు ప్రకటించి దళిత కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు.
Post A Comment: