గుండాల, సెప్టెంబర్ 25(మన్యం మనుగడ) : గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ ప్రజల రక్షణతో పాటు ప్రజాసేవే దేంగా పనిచేస్తున్నారు. గుండాల ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఉన్నతాధికారుల సూచనలు సీఐ కరుణాకర్ సహకారంతో లోని పల్లెలలోని సమస్యలను సంబంధిత అధికారులతో కలిసి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా గుండాల, రంగాపురం రహదారి భారీ వర్షాలకు దెబ్బ తినడంతో గ్రావెల్ పోసి చదును చేయించి వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేశారు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ బాధ్యతలు చేపట్టి తక్కువ సమయమైనప్పటికీ మండలంలో తనదైన శైలి లో ముద్ర వేశారు. ప్రజల రక్షణతో పాటు ప్రజా సేవలో ముందున్న ఎస్సై రాజశేఖర్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు
Navigation
Post A Comment: