గుండాల/ఆళ్లపల్లి , సెప్టెంబర్3(మన్యం మనుగడ) : సీఎం సహాయనిది పేదల పారిట వరం అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు . శనివారం కర్నె గూడెం గ్రామానికి చెందిన కొమరం రవికుమార్ ఇటీవల కాలం అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్యం చేపించుకున్నారు దీంతో వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా 60 వేల రూపాయలు చెక్కులు జడ్పిటిసి కొమర హనుమంతు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో రాఘవపురం సర్పంచ్ ప్రేమ కళ నడిమి గూడెం సర్పంచ్ కొమరం నరసింహారావు మర్కోడు గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు తాళ్లపల్లి రవి కొమర వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: