మన్యం టీవీ - దుమ్ముగూడెం ::
మండలంలోని ములకపాడు గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు చరక మహర్షి జయంతి 2వ రోజు సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ దేవి పూలమాలవేసి నివాళ్లు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ మోకాళ్ళ నొప్పులు మలబద్ధకం పక్షవాతం అధ్యయనం సంబంధిత వ్యాధులు కలిగిన 150 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు అలానే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలకు ఆయుర్వేద వైద్యం గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఈశ్వరి, వాలంటీర్ తనూజ, ములకపాడు గ్రామపంచాయతీ నెంబర్ కిషోర్ తెలుగు పాల్గొన్నారు
Post A Comment: