- గ్రేస్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు నోట పుస్తకాలు పంపిణీ.
- గ్రేస్ సేవా సొసైటీ అధ్యక్షులు జాన్ భాన్ ని అభినందించిన ఉపాధ్యాయులు
మన్యం మనుగడ కరకగూడెం: ఖమ్మం నగరానికి చెందిన గ్రేస్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో కరకగూడెం మండల పరిధిలోని బట్టుపల్లి,కల్వలనాగరం పినపాక మండల పరిధిలోని దుగినేపల్లి, పోతురెడ్డిపల్లె,రెడ్డిపాలెం ప్రభుత్వ పాఠశాలలో గ్రేస్ సేవా సొసైటీ అధ్యక్షులు ఎం.జాన్ భాను చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు,రాత పుస్తకాలు,పలుకలు, పెన్నులు విద్యార్థులకు ఉపయోగపడే పలురకాల వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పినపాక మండలంలో ఐదు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 350 మంది విద్యార్థిని విద్యార్థులకు సుమారు ఒక లక్ష 75 వేల విలువ చేసే వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రేస్ సేవా సొసైటీ ఇన్చార్జి రామారావు, సిబ్బంది ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: