స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్ల కంటే ముందు టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న కేఎల్ రాహుల్ సేన మూడు వన్డేలు ఆడనుంది. భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ మార్గదర్శనంలో 'పసికూన'తో పోరుకు సిద్ధమవుతోంది. కాగా ఆసియా కప్-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా పలువురు కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. దీంతో తొలుత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ను తొలుత ఈ జట్టుకు సారథిగా ఎంపిక చేశారు. అయితే, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడంతో ధావన్ను తప్పించి అతడికి కెప్టెన్సీ అప్పగించారు. ఇక గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ దూరం కావడంతో అతడి స్థానాన్ని షాబాజ్ అహ్మద్తో భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది.
Post A Comment: