CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

AP

ఉపాధ్యాయులపై మంత్రి బొత్స ఆగ్రహం

Share it:

 


శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయుల తీరుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించడం లేదని గ్రామస్థులు ఫిర్యాదుతో ఉపాధ్యాయులపై మండిపడ్డారు. ఉపాధ్యాయులకు అదనపు పనులు అప్పగించడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుతోందని వివరణ ఇవ్వగా మంత్రి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్కూళ్లలో బోధన సరిగ్గా లేదని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి మండలంలో పలు భవనాల ప్రారంభోత్సవానికి మంత్రి హాజరయ్యారు. చీపురుపల్లి మండలం కరకం, పత్తి కాయవలస గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను మంత్రికి వివరించారు. తమ గ్రామంలోని పాఠశాలల్లో టీచర్లు సరిగా చెప్పడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎంఈవో, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు అదనపు పనులు అప్పగించడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుతోందని వివరణ ఇవ్వగా మంత్రి బొత్స మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.


Share it:

AP

Post A Comment: