మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని గౌడ సంఘం నాయకుడు, బహుజన వీరుడు, సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గౌడ సంక్షేమ సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు గుండు రమేష్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం పినపాక తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ రాజారావు కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండు రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం, గౌడ కుల బాంధవుడు అయిన సర్దార్ సర్వాయి పాపన్న జ్ఞాపకార్ధంగా ఆయన జయంతిని జరుపుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల గౌడ సంఘం నాయకులు కొత్త దామోదర్ గౌడ్,బురా రమేష్ గౌడ్,బూర సురేష్ గౌడ్,మామిళ్ల శ్రీనివాస్ గౌడ్,తెలగాని రాము,సురేష్ గౌడ్ పాల్గొన్నారు.
Post A Comment: